1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 3 మే 2025 (12:59 IST)

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

romance
హైదరాబాద్ నగరంలో దారుణం ఘటన ఒకటి చోటుచేసుకుంది. 16 యేళ్ళ మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారానికి పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువతి పెట్టే వేధింపులను భరించలేని ఆ బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జూబ్లీహిల్స్‌లోని నివాసం ఉండే 28 యేళ్ళ ఓ మహిళ తన ఇంటి పక్కనే ఉండే 16 యేళ్ల బాలుడుతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తన ఇంటికి పిలిచి ఆ బాలుడుకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. ఇలా పలుమార్లు తన ఇంట్లోనే ఆ మైనర్ బాలుడుపై లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం బయటకు చెపితే తనపైనే అత్యాచారం చేశావని చెబుతానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 
 
అయితే, ఆ మహిళ నుంచి వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో ఆ బాలుడు భరించలేకపోయాడు. పైగా, అసభ్యకరమైన పనులు చేయాలంటూ ఒత్తిడి చేయసాగింది. దీంతో వీటిని భరించలేని ఆ బాలుడు... తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.