మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (22:15 IST)

స్నేహితుడి భార్యపై వ్యక్తి అత్యాచారం.. విడాకులిచ్చిన భర్త

victim
తన స్నేహితుడి భార్యపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు కట్టుకున్న భర్తకు చెప్పింది. తన భార్యపై లైంగికదాడికి పాల్పడిన స్నేహితుడిని మందలించాల్సిన భర్త ఆ పని చేయకపోగా, కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌కు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం ఆమె కూడా తన భర్తకు చెందిన ముస్లిం మతాన్ని స్వీకరించింది. 
 
పెళ్లైన కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త స్నేహితుడు హసీబ్ సిద్ధిఖీ, ఆ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవచూపాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌ 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
కాగా, ఆ మహిళ జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పింది. అయితే అతడు తన స్నేహితుడిపై ఎలాంటి చర్య తీసుకోలేదు కదా కనీసం మందలించను కూడా లేదు. భార్యపై అత్యాచారం చేసిన సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పైగా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. 
 
దీంతో బాధితురాలు ఇండోర్‌కు వెళ్లింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇండోర్‌ పోలీసులు ఆ కేసును భోపాల్‌లోని గౌతమ్ నగర్ ప్రాంతం పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.