1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 11 ఆగస్టు 2021 (19:44 IST)

వాట్సప్ సందేశాలు పంపుతూ వల, ఇతర రాష్ట్రాల నుంచి యువతులు...

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో అసాంఘిక కార్యకలాపాలతో కొంతమంది అపవిత్రం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా దాడులు నిర్వహించి ఆ తరువాత సరిపెట్టేస్తున్నారన్న విమర్సలు లేకపోలేదు.
 
తాజాగా తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్‌కు సమీపంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేవలం వాట్సాప్ లోనే అందమైన యువతుల ఫోటోలను పంపించి రేటు మాట్లాడి ఆ తరువాత ఈ వ్యాపారాన్ని చేసే ముఠాలోని కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
గత కొన్నినెలలుగా జ్యోతి అనే ఒక మహిళ పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అది కూడా అలిపిరి పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం కాస్త ఒక్కసారిగా బయటకు వచ్చింది.
 
ఐదుగురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే నిర్వాహకురాలు జ్యోతిని పట్టుకున్నారు పోలీసులు. నిందితులను కోర్టుకు తరలించగా యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.