మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఏప్రియల్ 2025 (09:01 IST)

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

torture
ప్రియుడు మోజులో పడిన ఆ మహిళ.. కన్నపేగుపై ఉన్న ప్రేమ బంధాన్ని మరిచిపోయింది. అభంశుభం తెలియని బిడ్డపై ఏమాత్రం కనికరం చూపలేదు. ప్రియుడుతో కలిసి ఉండేందుకు పేగుబంధం అడ్డునకుంది. ప్రియుడుతో కలిసి కన్నబిడ్డకు నరకం చూపించింది. హైదరాబాద్ తీసుకెళ్లి మరీ ఒంటినిండా వాతలు పెట్టింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరుగగా, ఆదివార వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ రూరల్ మండలి జక్కంపూడి కాలనీకి చెందిన వందన అనే మహిళకు మూడేళ్ల కుమార్తె ఉంది. తల్లిదండ్రులు వివాహం చేసిన భర్తను వదిలివేసి మరో వ్యక్తితో కలిసి వందన సహజీవనం చేసింది. ఆ తర్వాత చిట్టినగర్‌కు చెందిన శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత వందన తన కుమార్తెను తీసుకుని శ్రీరాములుతో కలిసి హైదరాబాద్ నగరానికి వెళ్లిపోయింది. అయితే, అక్కడ తమ సుఖానికి అడ్డుగా కన్నబిడ్డ ఉండటాన్ని వందన జీర్ణించుకోలేకపోయింది. దీంతో తన ప్రియుడితో కలిసి కుమార్తెను చిత్రహింసలకు గురిచేయసాగింది. 
 
ఈ క్రమంలో ఆమె ఒంటినిండా వాతలు పెట్టింది. అలా 20 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన తర్వాత చిన్నారిని తీసుకుని విజయవాడ రైల్వే  స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీరాములు తన తల్లి సుమలతకు ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించుకుని ఆ చిన్నారిని వారికి అప్పగించి ఆ తర్వాత వారిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీంతో సుమలత ఆ చిన్నారిని ఇంటికి తీసుళ్లి పరీక్షించగా, ఒంటినిండా వాతలు ఉండటంతో స్థానిక వైద్యుడు వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించింది. 
 
కొన్ని రోజులకు శ్రీరాములు, వందనలు విజయవాడకు ఆ చిన్నారి కోసం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారిద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు పారిపోయారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఆ మహిళ, ఆమె ప్రియుడు కోసం గాలిస్తున్నారు.