1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:03 IST)

ప్రియుడితో వచ్చి తప్పు చేసాను, నన్ను క్షమించండి

భర్త అంటే ప్రేమే. కానీ తరచూ తాగి రావడం ఆ ఇల్లాలికి ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. మనకి పిల్లలు లేరు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. భయంగా ఉంటోంది. నన్ను చూసుకోవాల్సింది నువ్వేగా.. ఇలా నువ్వు తాగి వస్తే ఎలా అని భర్తను ఎన్నోసార్లు ప్రశ్నించింది. కానీ అతనిలో మార్పు రాలేదు. అయితే ఏ అలవాటులేని ఒక డిగ్రీ విద్యార్థికి ఆ మహిళ కనెక్టయ్యింది. అతనితో సహజీవనం మొదలెట్టింది. కానీ చివరకు..

 
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కెంకెర గ్రామానికి చెందిన దివ్య అనే యువతికి నాథన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. దివ్యకు 22 యేళ్ళు. నాథన్‌కు 38యేళ్ళు. వయస్సు ఎక్కువగా ఉన్నా తల్లిదండ్రులు వివాహం చేశారు.

 
నాథన్ వైన్ షాప్‌కు ఓనర్. ఆస్తి బాగా ఉండడంతో అతనికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళికి ముందు బాగానే ఉన్నా.. పెళ్ళి తరువాత చెడు స్నేహాలు ఎక్కువై తాగుడు బానిసయ్యాడు నాథన్. దీంతో ప్రతిరోజు తాగి రావడమే పనిగా పెట్టుకున్నాడు. భర్తను ఎన్నో విధాలుగా మార్చాలని చూసింది భార్య.

 
పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసి ఆటోడ్రైవర్‌గా ఉన్న రాకేష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేత సంబంధానికి దారితీసింది.

 
భర్తతో ఇక ఉండలేనని నిర్ణయించుకుని 20 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ప్రియుడితో వేరే కాపురం పెట్టింది. సహజీవనంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే మూడురోజుల క్రితం దివ్యకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా వదిలేశాడు రాకేష్.

 
దీంతో తాను చేసిన తప్పు ఎలాంటిదో తలుచుకుని కుమిలిపోయింది దివ్య. తన భర్తపై తనకు ఇంకా ప్రేమ ఉందంటూ ఒక లేఖను రాసింది. ప్రియుడితో వచ్చి తప్పు చేసాను, నన్ను క్షమించండి అంటూ ఆ లేఖలో పేర్కొని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.