1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (09:51 IST)

ర్యాష్ డ్రైవింగ్: బైక్ ఎక్కబోతుండగా కారు ఢీకొంది.. మహిళ మృతి

Woman
Woman
ఎక్సైజ్ శాఖ సీఐ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారుతో ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. సెయింట్ గాబ్రియెల్ స్కూలు వద్ద కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా స్విఫ్ట్ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. 
 
ఓటు వేయడానికి భర్తతో వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారు రాంగ్ రూట్‌లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.