కంటిచూపును మెరుగుపరిచే చేపలతో పకోడీలు చేసేద్దామా?

ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలు

శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:37 IST)
వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - రెండు కప్పులు
కోడిగుడ్లు -  మూడు
కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు
కారం -  రెండు టీ స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. ఈ వేయించిన చేప ముక్కల్ని గ్రీన్ చట్నీతో వేపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నీ చూడండి

భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతునులిమి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా..

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం

జూలై 22, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

అన్నీ చూడండి

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

తర్వాతి కథనం
Show comments