1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2021
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (10:58 IST)

తెలంగాణలో జరిగిన అత్యాచారం కేసుల్లో 98 శాతం మంది బాధితులకు తెలిసినవారే

2021లో జరిగిన 95 హత్యలకు ఆస్తి, కుటుంబ తగాదాలు ప్రధాన కారణాలు. కుటుంబ కలహాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ద్వేషపూరిత సంబంధాలు కూడా హత్య కేసులకు కారణమయ్యాయి. అయితే ఆకస్మికంగా పరస్పరం రెచ్చగొట్టుకోవడం, భావోద్వేగాలు కూడా హత్యలకు దారితీసినట్లు తేలింది.

 
హత్య కేసుల వెనుక కారణాలను తెలుసుకునేందుకు తెలంగాణ పోలీసులు నిర్వహించిన విశ్లేషణలో ఈ విషయం తేలిందని పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. 2021లో జరిగిన 85 హత్య కేసుల్లో యాభై ఐదు శాతం మంది నిందితులు బాధితులకు తెలుసు. బాధితుల ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఆ డబ్బును పొందేందుకు నిందితులను లబ్ధి కోసం హత్యకు ప్రేరేపించాయి. దురాశ, సులభ సంపాదన మరియు బాధితుల ఆర్థిక సమాచారాన్ని పొందడం ఈ నేరాలకు ప్రధాన కారణాలు. మిగిలిన 45 శాతం కేసుల్లో నిందితులు ఎవరో తెలియరాలేదు.

 
ఇకపోతే... 2021లో నమోదైన 2,383 అత్యాచార కేసులకు సంబంధించి, నేరస్థులు ఎక్కువగా బాధితులకు తెలిసినవారేనని పోలీసు విశ్లేషణలో తేలింది. 26 కేసుల్లో గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడగా, 2,356 కేసుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, సన్నిహితులు ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది.

 
డ్రగ్స్‌ వ్యాపారులపై కొరడా ఝులిపించేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచడమే కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్, రిక్రూట్‌మెంట్, అవార్డులు మరియు గుర్తింపులు, స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమాలు, షీ సైబర్ ల్యాబ్‌లు, డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలిసిస్-మానిటరింగ్ సిస్టమ్ గురించి ఆయన వివరంగా వివరించారు.