గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే..

శుక్రవారం, 20 మే 2016 (16:41 IST)
ఆరోగ్యానికి మేలు చేసే పొషక విలువలు కలిగిన పండ్లు అందానికి కూడా మేలు చేస్తాయి. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని సందర్భాలలో ముఖంపై మురికీ, జిడ్డు పేరుకుపోతుంది. అలాంటి సమయంలో ఖరీదైన క్రీములు, పౌడర్లూ ఉపయోగించడం మూలంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. అటువంటప్పుడు సహజంగా దొరికే పండ్లను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.

ఆరంజ్‌ తొక్కలను బాగా ఎండబెట్టి, పొడిచేసుకోవాలి. ఒక స్పూన్‌ నారింజ పొడి తీసుకుని, దీనిలో పెరుగును కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
పడుకునే ముందు గులాబీ నీళ్లూ, గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, మర్నాడు ఉదయాన్నే కడిగేస్తే ముఖం నిగనిగలాడుతుంది.

ఒక టీస్పూన్‌ బొప్పాయి గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖాన్ని తాజాగా మారుస్తుంది. 
 
సెనగపిండిలో గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక కడిగేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. పుచ్చకాయ రసం, కమలా పండు రసం, దోసకాయ గుజ్జు... దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం కొత్తనిగారింపు సంతరించుకుంటుంది. గులాబీ  పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. 

అన్నీ చూడండి

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార సమావేశం.. కావేరికి చేరిన డీకే శివకుమార్

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments