శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (18:17 IST)

ప్రతిరోజూ ఖర్జూరం పాలను తీసుకుంటే?

ఖర్జూరాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాలలో శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పాలను తాగడం వలన రక్తహీనత తొలగిపోతుంది. అలసటగా

ఖర్జూరాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాలలో శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పాలను తాగడం వలన రక్తహీనత తొలగిపోతుంది. అలసటగా, నీరసంగా ఉన్నవారు ఖర్జూరం పాలను తీసుకోవడం వలన తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
  
 
జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. నేత్ర సమస్యలు తొలగిపోతాయి. దృష్టి బాగా మెరుగుపడుతుంది. రేచీకటి వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుటలో ఖర్జూరం పాలు చక్కగా పనిచేస్తాయి. మెదడు ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. 
 
ఈ పాలను తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎముకలు పటుత్వానికి, బలానికి ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది. పెద్దప్రేగులోని సమస్యలకు ఈ పండు తీసుకుంటే మంచిది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మూత్రపిండాలలో రాళ్లు రాకుండా ఉండేందుకు ఖర్జూరం పాలను తరచుగా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.