సంబంధిత వార్తలు
- ముర్ము ఇంటికి ప్రధాని మోడీ.. కొత్త రాష్ట్రపతికి స్వీట్లు తినిపించిన అమిత్ షా
- రిసెప్షన్ వేదికపై కొట్టుకున్న వధూవరులు.. స్వీట్లు తింటూ..
- బిర్యానీతో వడ్డించే బ్రెడ్ హల్వాకు తక్కువేం కాదు.. రస్క్ హల్వా తయారీ ఇదో..
- క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే ఫలితం ఏంటి?
- సహజసిద్ధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎలా తగ్గించుకోవచ్చు?
స్వీట్లు లేదా చక్కెర మోతాదుకి మించి తింటే?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది.
అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి.
అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక చక్కెర వినియోగం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు, ఆందోళన, నిరాశ వంటి భావోద్వేగ రుగ్మతలు కలుగుతాయంటారు. ఫ్రక్టోజ్ అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తర్వాతి కథనం
