పండ్లను శుభ్రంగా కడిగి తినకపోతే..?

పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకా

Written By Selvi
Updated: బుధవారం, 9 ఆగస్టు 2017 (11:05 IST)
పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలకు రంగు వచ్చేందుకు, పండేందుకు రసాయనాలు వాడుతున్నారు. వాటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, క్యాన్సర్‌ వంటి రోగాలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇలా శుభ్రం చేయని పండ్లను తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఇంటికి తెచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్ది సేపు నానబెట్టిన తరువాత గుడ్డతో తుడిచేసిన తరువాత వాటిని తినాలి. ఏ కాలంలో దొరికే పండ్లను అప్పుడే తినాలి. 
 
యాపిల్‌లో ఎక్కువగా మెరుపు కన్పిస్తే మైనపు పూత ఉన్నట్లే. గోటితో పండుపై గీకితే అంటుకుంటుంది. ఒకవేళ ఇంటికి తెచ్చినట్లైతే చాకుతో పైన చెక్కినా చాలు. అనుమానం ఉంటే పండుపై వేడి నీళ్లు పోస్తే తెలిసిపోతుంది. మైనపు పూత పోవాలంటే పండును బాగా కడగాలి. చాకుతో తొక్కను మొత్తం తీసి వేసి అప్పుడే తినాలి. లేదంటే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు మరింత ప్రమాదకరం. బాగా పండినవి, తొడిమ తొలగకుండా ఉన్న అరటి పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)

రాజ్యమా ఉలికిపడు... ప్రధాని మోడీకి కేటీఆర్ హెచ్చరిక

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆందోళన చేస్తాం : సీజీపీ

అన్నీ చూడండి

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

Palla Burusu : పళ్ళబురుసు నుంచి జానపదంలో కొత్త సోకు సాంగ్ రిలీజ్

ప్రభాస్ స్పిరిట్‌లో కత్రినా కైఫ్.. దీపికా అలా చేయడంతో?

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

తర్వాతి కథనం
Show comments