Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసు మంచినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 27 నవంబరు 2020 (21:54 IST)
ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు శీతాకాలంలో తుఫాను వర్షాలు. ఈ నేపధ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువ. అందులో మరీ దగ్గు, జలుబు ముందుంటాయి. ఈ లక్షణాలు కనబడితే ఇప్పుడు కరోనావైరస్ అనే భయం కూడా వెంటాడుతోంది. ఐతే అన్ని లక్షణాలు కరోనావైరస్ కావు. అందువల్ల పొడిదగ్గు వచ్చిన వెంటనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
 
1. అరకప్పు నీటిలో ఒక స్పూన్‌ పసుపు, ఒక స్పూన్‌ మిరియాల పొడి, ఒక స్పూన్‌ తేనె వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
 
2. దగ్గు విడవకుండా వస్తున్నట్లయితే టేబుల్‌ స్పూన్‌ తేనె తీసుకుంటే మంచిది.
 
3. నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది.
 
4. దగ్గు బాధిస్తున్నప్పుడు ఫ్లాట్‌గా ఉన్న బెడ్‌పై పడుకోకుండా తలపై దిండ్లను ఎత్తుగా పెట్టుకోవాలి. దీనివల్ల గొంతులో కొంచెం గరగర రాకుండా ఉంటుంది.
 
5. గ్లాసు నీటిని గోరు వెచ్చగా వేడి చేసి చిటికెడు ఉప్పు వేసి పుక్కిలించాలి. 
 
6. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. 
 
7. వేడి పాలలో ఒక స్పూన్‌ తేనె కలుపుకుని తాగితే పొడి దగ్గునుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments