ఆన్ లైన్ లో ద్వాదశి దర్శన టికెట్లు షురూ
వైకుంఠ ఏకాదశి, జనవరి1 పురస్కరించుకుని వైకుంఠద్వారా దర్శనం చేసుకోవాలకుని టికెట్లు దొరకని,వీలుకాక నిరాశ చెందే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ద్వాదశి నాడు ఆ దర్శనభాగ్యాన్ని కలిగిస్తోంది. ద్వాదశి నాడు కూడా వైకుంఠద్వారా తెరచే ఉంటుంది. ఆ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే వారి కోసం ఆన్ లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశాన్ని కల్గించింది.
ఈ టికెట్ల కొనుగోలు బుధవారం ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ద్వాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వారు ఆన్ లైన్ ద్వారా రూ.300 నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు. కేవలం 10 వేల టికెట్లు మాత్రమే ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతారు.