తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ75,175 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 6 నిండాయి. వారికి 7 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం కాస్త రద్దీ తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితి మంగళ, బుధవారాలలో కూడా ఇలాగే ఉండవచ్చు.