రాష్ట్రాన్ని ప్రగతి పథంలె నడిపించు. నాకు పార్టీ ప్రాధాన్యత కల్పించు.. శ్రీవారి సేవలో పయ్యావుల
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవి వచ్చే చాన్స్ ఎలాగూ పోయింది కనీసం పార్టీలో ప్రాధాన్యత లభించేలా చూడు స్వామి అంటూ వెంకన్నను కోరుకున్నాడు. ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారిని నైవేద్య విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఏడుకొండల స్వామివారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరు సుఖసంతోశాలతో వర్దిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకెళ్ళడానికి తిరుమల కీలక పాత్ర వహిస్తుందన్నారు. తిరుపతి అభివృద్ది చెందుతున్నవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది ప్రణాళికలు జరగాలని కోరుకున్నానన్నారు.