అమెరికాలో తెలుగు విద్యార్థులకు బహిష్కరణ భయం.. ఒకరు ఆత్మహత్య?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టబద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించనివారి గుండెల్లో ఆయన రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇలా అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇప్పటికే 250 మంది వరకు స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న అనేక మంది ప్రవాస భారతీయులకు బహిష్కరణ భయం పట్టుకుంది. ఇదే భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మృతుడి వివరాలు మాత్రం తెలియాల్సివుంది
మృతుడి స్నేహితుడి కథనం మేరకు ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్ళాలడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి వేట మొదలుపెట్టారు. వీరిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు.
ఈ క్రమంలోనే సాయికుమార్ రెడ్డి పని చేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, సాయికుమార్ రెడ్డి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న్టుట తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.