శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (16:26 IST)

ఉత్తర ఇంగ్లండ్‍‌లో భారత సంతతి మహిళను.. వెంటాడి మరీ చంపేశాడు?

ఉత్తర ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురైంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్ బరో పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫార్మసిస్టుగా పని చేస్తున్న జెస్సికా పటేల్ అనే భారత సంతతి మహ

ఉత్తర ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురైంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్ బరో పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫార్మసిస్టుగా పని చేస్తున్న జెస్సికా పటేల్ అనే భారత సంతతి మహిళను గుర్తు తెలియని దుండగుడు ఆమెను వెంటాడి మరీ హత్య చేశాడు. హంతకుడి కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. 
 
జెస్సికా, మితేష్ దంపతులు గత మూడేళ్లుగా మిడిల్స్ బరోలో ఫార్మసీని నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో చదుకునే సమయంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
కానీ హత్యకు గల కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేమని.. జెస్సికా నివాసం వుండే రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని.. దీంతో ఆధారాలను సేకరించడం కష్టంగా మారిందన్నారు. మిడిల్స్ బరోలో మంచి పేరున్న ఫార్మసీని నడిపిన ఈ జంట అన్యోన్యంగా వుంటుందని స్థానికులు చెప్తున్నారు.

జెస్సికా పటేల్ వెంటాడి మరీ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోగానే హంతకుడు హతమార్చాడని.. ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.