బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (11:07 IST)

థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెక్కీ

థాయ్‌లాండ్‌లో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఆమె పేరు ప్రజ్ఞ (29). స్థానికంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యువాతపడ్డారు. బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నా ఆమె... హాంగ్ కాంగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫుకెట్‌లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్‌లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పజ్ఞ కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో నివసిస్తోంది. ప్రజ్ఞ మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్‌కు థాయిలాండ్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్న కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా వివరించారు. 
 
బ్యాంకాంగ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ప్రగ్న కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, థాయిలాండ్‌లో ఉన్న మన ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఆమె కుటుంబీకులకు వెంటనే పాస్ పోర్టును ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు.