శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (14:43 IST)

బికినీలో ఆమె అందాలను చూసి పంది 'ఫిదా'... ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా మోడల్‌లు సముద్ర తీరంలో బికినీలో ఫోటో షూట్ చేస్తుంటారు. అలాగే విదేశాలలో ఉన్న బీచ్‌లలో చాలామంది బికినీలతో దర్శనమిస్తుంటారు. అయితే అభిమానులు కొన్ని సందర్భాల్లో వారిపై పడి వాళ్లకు చిరాకు తెప్పిస్తుంటారు. తాజాగా జరిగిన ఒక సంఘటన అందరినీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది.
 
వెనెజులాకి చెందిన మిచెల్లీ లెవిన్ అనే 32 ఏళ్ల ఫిట్‌నెస్ మోడల్ బహమాస్‌లో గల బిగ్ మేజర్ కే ద్వీపంలో బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటోంది. అయితే ఆ ప్రాంతంలో పందులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ పందుల గుంపు ద్వీపం చుట్టూ ఉన్న నీళ్లలో ఈత కొడుతూ, వచ్చేపోయే టూరిస్ట్‌లను ఆకర్షిస్తూ ఉండేవి. అంతేకాకుండా వచ్చిన సందర్శకులు సైతం వాటితో ఫోటోలు తీసుకునేవారట.
 
మిచెల్లీ బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటున్న సమయంలో పందుల గుంపు ఒకటి ఆమె వైపుకు వేగంగా వచ్చాయట. వాటిని చూసి పరుగు పెట్టినప్పటికీ, అందులో భారీ ఆకారంలో ఉన్న పంది ఒకటి ఆమె ధరించిన బికినీ కుడివైపు ప్రదేశాన్ని బాగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని లెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, కేవలం ఒక్క రోజులో దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయట. ఈ ఘటనను చూసిన కొందరు నెటిజన్లు... పంది మీ అందానికి ఫిదా అయి అలా చేసి వుంటుందిలే అని సెటైర్లు పేలుస్తున్నారు.