1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:40 IST)

వామ్మో.. టాంజానియాలో కొత్త వ్యాధి.. రక్తపు వాంతులు.. 15మంది మృతి

Tanzania
కరోనా మహమ్మారి తరువాత అనేక కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా న్యూ స్ట్రెయిన్ బ్రిటన్ ను, అటు దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేస్తున్నది. బ్రెజిల్ లోనూ కొత్త స్ట్రెయిన్ తో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ కొత్త వ్యాధి భయపెడుతుంది. టాంజానియాలోని ఎంబేయా ప్రాంతంలోని ప్రజలు రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. 
 
ఇలా రక్తంతో కూడిన వాంతులు చేసుకున్న గంటలోగా మరణిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆ ఎంబెయా ప్రాంతానికి ప్రత్యేక వైద్యబృందాలను పంపి వ్యాధిపై పరిశోధన చేస్తున్నారు. 
 
ఇప్పటి వరకు ఈ కొత్త వ్యాధితో 15 మంది మరణించగా, 50 మందికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యశాఖ తెలిపింది. అయితే, ఈ వింత వ్యాధి మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తున్నట్టు టాంజానియా వైద్యశాఖ ప్రకటించింది.