1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:20 IST)

త్వరలో భారత్‌కు వియత్నాం ప్రధాని

త్వరలో భారత్‌లో వియత్నాం ప్రధాని ఫమ్‌ మిన్హా చిన్హా పర్యటించనున్నారు. ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన మిన్హా చిన్హాకు ఇదే తొలి భారత పర్యటన.

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వియత్నాం ప్రధాని చర్చలు జరుపుతారని భారత్‌లో ఆ దేశ రాయబారి ఫమ్‌ సన్హా చౌ తెలిపారు.

చాణక్యపురిలోని వియత్నాం రాయబార కార్యాలయంలో ఆ దేశ జాతిపిత హోచిమిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫమ్‌ సన్హా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. జులైలో వియత్నాం ప్రధానితో మోడీ ఫోన్‌లో మాట్లాడుతూ భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.