బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:36 IST)

తప్పిపోయిన కుమార్తె కోడలుగా వచ్చింది.. అంతే షాకైన తల్లిదండ్రులు.. చివరికి..?

అవును.. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తె కోడలిగా వచ్చింది. అంతే ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయింది. తన కుమారుడితో జీవితం పంచుకోబోయే కోడలే చిన్ననాట తప్పిపోయిన తన కుమార్తెని ఆమె గుర్తించింది. కొత్త కోడలి చేతిపై పుట్టుమచ్చని చూసి ఇరవై ఏండ్ల కిందట తప్పిపోయిన తన కూతురు ఈమేనని మహిళ నిర్ధారించుకుంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో మార్చి 31న ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టుమచ్చను పోల్చుకున్న మహిళ నేరుగా వధువు తల్లితండ్రులను ప్రశ్నించగా తమకు చాలా ఏండ్ల కిందట రోడ్డు వెంట పసిపాప కనిపించగా తమ ఇంటికి తెచ్చుకుని సాకామని వారు చెప్పారు.
 
ఈ కథంతా విన్న నవ వధువు కన్నీరుమున్నీరైంది. తనకు జన్మనిచ్చిన తల్లిని గుర్తించడం పెండ్లి కంటే ఆనందంగా ఉందని పేర్కొంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్‌ కూడా వెల్లడైంది. తాను అన్నను పెండ్లాడుతున్నానని పెండ్లి కుమార్తె కలత చెందగా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెండ్లి కొడుకు తన సంతానం కాదని, తాను అతడిని దత్తత తీసుకున్నానని మహిళ పేర్కొనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
చిన్ననాట తప్పిపోయిన కుమార్తె ఆచూకీ ఎంతకీ తెలియరాకపోవడంతో ఓ బాలుడిని ఆమె దత్తత తీసుకుంది. వారు ఒకే కడుపున జన్మించనందున వారి వివాహం సమస్య కాబోదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక పెండ్లితంతును పూర్తిచేయగా కొత్త జంటను అతిథులు ఆశీర్వదించారు.