శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (15:20 IST)

పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్... జస్ట్ రూ.150తో

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడటంతో పాటు తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇప్పటివరకు ప్రీపెయిడ్ కస్టమర్లకే వ

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడటంతో పాటు తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇప్పటివరకు ప్రీపెయిడ్ కస్టమర్లకే వీటిని ప్రకటిస్తూ వచ్చింది. ఇపుడు పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు కూడా ప్రకటించింది. 
 
ఇందులోభాగంగా, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు 150 రూపాయల సరికొత్త ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందించనునట్టు తెలుస్తోంది. 150 రూపాయల ప్యాక్‌తో రోజుకు 1జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఈ 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు, 500 ఎంబీ రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. 
 
కాగా, ఇప్పటికే 345 రూపాయల ప్యాక్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించిన విషయంతెల్సిందే. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డేటానే ఆశిస్తున్నారని భావించడంతో ఎయిర్ టెల్ ఈ తరహా ఆఫర్‌తో ముందుకు వచ్చింది.