భారత్లో ఉచిత ఇంటర్నెట్.. మార్గాలను అన్వేషిస్తున్న 'ట్రాయ్'!
భారత్లో ఉచితంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందా? ఈ దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి.
వాస్తవానికి దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినా.. ధరలు మాత్రం ఇంకా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేవు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ అందించాలని ట్రాయ్ ఆలోచిస్తోంది. ట్రాయ్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది.
ఈ ఉచిత ఇంటర్నెట్ను అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను కేటాయించడం లేదా వినియోగించిన డాటాను రీయింబర్స్ చేసే పథకాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.