శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (16:33 IST)

ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..

స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేలా.. కొత్త ప్లాన్‌కు వాట్సాప్ సంస్థ సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. అలాగే భారత్‌లో మాత్రం 250 మిలియన్ వాట్సాప్ వినియోగదారులున్నారు. అంతేగాకుండా ఫేస్‌బుక్‌ చేతిలోకి వాట్సాప్ కూడా చేరాక పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వాట్సాప్‌ సంస్థకు ఆదాయం చేకూర్చే దిశగా ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. 
 
ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు ఇచ్చేలా ఆ సంస్థ యోచిస్తోంది. దీని ప్రకారం ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్లను వుంచనుంది. ఇలా వాట్సాప్ స్టేటస్‌లో వుంచే ప్రకటనలకు మంచి క్రేజ్ లభించే అవకాశం వుండటంతో.. సదరు వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే ఛాన్సుందని వాట్సాప్ తెలిపింది.
 
ఈ మేరకు వాట్సాప్ సంస్థ అధికారి డేనియల్స్ కూడా వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనల అమలుకు సన్నద్ధంగా వున్నట్లు ధ్రువీకరించారు. త్వరలో ఈ ప్లాన్ అమల్లోకి రానుందని చెప్పారు. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే నిర్ధిష్ట సమయాన్ని వాట్సాప్ పేర్కొనలేదు.