1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (11:25 IST)

మోడీ వంటి భయస్థుడుని ఎప్పుడూ చూడలేదు : ప్రియాంకా గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రత్నసింగ్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, మోడీ వంటి భయస్థుడు, బలహీనమైన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ మరిచారని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. 
 
తమ పార్టీ  లేదా తమ పార్టీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రాగానే పేదల కోసం తీసుకొచ్చిన న్యాయ్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. అలాగే, తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు.