ఇంటి గోడను పగులగొడితే 186 పాములు బయటపడ్డాయ్.. ఎక్కడ?
ఉత్తర ప్రదేశ్లోని ఓ ఇంట్లో 186 పాముల్ని కనుగొన్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇంట్లో జితేంద్ర మిశ్రా అనే రిటైర్డ్ అటవీశాఖ అధికారి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. గత ఆదివారం రాత్రి నిద్రిస్తుండగా పాము బుస కొట్టడంలో శబ్ధం విని నిద్ర లేచి చూసి షాక్ అయిన అధికారి తన కుటుంబాన్ని పొరిగింటికి చేర్చి.. ఆ రాత్రి జాగారం చేశాడు.
మర్నాడు ఓ పాములు పట్టే వాడిని పిలిపించాడు. ఇంట్లో ఉన్న పాముల సంగతి చెప్పాడు. ఇంటిని బాగా సోదా చేసిన పాములోడు.. ఓ గోడను పగలగొట్టడంతో అందులో ఓ పాముల మందే బయట పడ్డాయి. ఏకంగా 186 పాములు గుంపుగా కనపడటంతో అక్కడి వారు షాక్కు గురయ్యారు. పాములను జాగ్రత్తగా పట్టుకుని ఊరి చివరనున్న చెరవు వద్ద వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.