గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:08 IST)

మూడేళ్ల బాలికపై ఉపాధ్యాయుడి అత్యాచారం.. ఎక్కడంటే?

భోపాల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వైద్య పరీక్షల నివేదికలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించడంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు అందిన వెంటనే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలోనే నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు.

నిందితుడు కాసిం రెహాన్‌గా 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' బోధించేవాడని మిశ్రా తెలిపారు. ఈ విషయంపై విచారణ ఇంకా కొనసాగుతోంది" అని పోలీసు కమిషనర్ తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఘటనను ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.