శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (22:15 IST)

నా కూతురు కావాలా? నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా? ఏ తల్లీ చేయని పని చేసింది

ఏ తల్లీ చేయని దారుణానికి ఒడిగట్టింది ఆ తల్లి. తన కన్న కూతురునే కామాంధుడికి అప్పజెప్పింది. తనకు కావాల్సిన జల్సాలు తీరుస్తున్న వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ వాటికి తన కుమార్తె జీవితాన్ని బలి చేసింది. వివరాల్లోకి వెళితే.. అతడు తమిళనాడు అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.
 
పార్టీ అధికారంలో వుంటే కొందరికి కన్నూమిన్నూ కానరాదు కదా. ఇతడు కూడా అదేరకం. తనకు సాయం చేయాలంటూ వచ్చిన ఓ మహిళను మెల్లగా లొంగదీసుకున్నాడు సదరు మాజీ ఎమ్మెల్యే. ఆమెను రిసార్టులు, ఫామ్‌హౌస్‌లకు తిప్పి పూర్తిగా తనకు బానిసగా మార్చేసుకున్నాడు. ఐతే అతడితో ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఆమె తన వెంట 15 ఏళ్ల కుమార్తెను తీసుకెళ్లింది.
 
ఈ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. నీకంటే నీ కూతురు చాలా అందంగా ఉందనీ, ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ఉందన్నాడు. నువ్వు అడింది ఏనాడైనా కాదన్నానా అంటూ కుమార్తెను తీసుకెళ్లి ప్రియుడికి అప్పగించేసింది. ఆమెను ఆ కామాంధుడు రెండేళ్ల పాటు నిర్బంధంలో పెట్టి తన పశువాంఛను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికను తన స్నేహితులకు అప్పగించాడు.
 
ఇది జరిగింది 2017లో కాగా ఈ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురుగేషన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు అతడికి బెయిల్ ఇవ్వలేమని తిరస్కరించింది. కొసమెరుపు ఏంటంటే.. తన కుమార్తెను మాజీ ఎమ్మెల్యేకి అప్పగించిన సదరు మహిళ తన కుమార్తె కనబడటం లేదనీ, ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనని పోలీసు కేసు పెట్టింది. పోలీసులు తమదైన శైలిలో విచారించి చివరికి తల్లిని, ఆమె ప్రియుడు-మాజీ ఎమ్మెల్యేని కటకటాల వెనక్కి నెట్టారు.