శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 అక్టోబరు 2019 (17:37 IST)

మహిళతో అక్రమ సంబంధం: రాజకీయ నాయకుడి దారుణ హత్య

ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సంబంధాల విషయంలో కొన్నిసార్లు ఎలాంటి కేసులు కూడా నమోదు చేసే వీలు లేకపోవడంతో నేరాల సంఖ్య అధికమవుతున్నాయి. ముఖ్యంగా ఓ మహిళ, పురుషుడు ఇష్టపడి సంబంధం నెరపితే తప్పేమీ లేదని పలు కేసుల్లో వెల్లడి కావడంతో యధేచ్చగా అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతోంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఓ రాజకీయ నాయకుడు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి, అవతలి వ్యక్తి పొలిటీషియన్ కావడంతో ఏమీ చేయలేక భార్యను మందలించాడు. ఐనప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఆ సంబంధం అలానే సాగించారు. దీనితో తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ భర్త పక్కా ప్రణాళికతో తన భార్యతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న రాజకీయ నాయకుడుని హత్య చేసి ముక్కల కింద నరికి గోనె సంచుల్లో కుక్కి అక్కడక్కడ విసిరేశారు.
 
ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. హత్య గావింపబడ్డ నాయకుడు సీపీఎం నేత సుభాష్ చంద్రదేవ్. ఇతడు గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చివరికి సోమవారం నాడు అతడి మృతదేహం భాగాలు కనుగొని దర్యాప్తు చేపట్టారు. హతుడు కాల్ లిస్ట్ చూడగా మహిళతో జరిగిన సంభాషణను బట్టి ఆమెతో అతడు వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో సదరు మహిళతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతడిని తనే చంపినట్లు మహిళ భర్త అంగీకరించాడు.