సంబంధిత వార్తలు
- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు
- ఢిల్లీలో దంచికొట్టిన వర్షం - విమాన రాకపోకల్లో ఆలస్యం
- YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు
- Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ
- పాక్కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!
Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)
Air India
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఢిల్లీ నుంచి భువనేశ్వర్కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్కు చెందిన ఓ ప్రయాణీకుడు శ్వాస సరిగ్గా ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విమానంలో ఏసీ ఫెయిల్యూర్ కారణంగా ప్రయాణీకులు గాలి లేకుండా నరకం అనుభవించారు.
ఎండ తీవ్రతకు తోడు ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎయిర్ ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అస్వస్థతకు గురైన తుషార్ కాంత్ అనే ప్రయాణీకుడు సూచించాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు కోరింది.
ఎయిర్ ఇండియాలో ఉక్కపోత.
— greatandhra (@greatandhranews) May 19, 2025
ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో గాలి లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఇలాంటివి ఎయిర్ ఇండియాలో తరచూ జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. #AirIndia pic.twitter.com/SMlStXUAMw
