శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (15:11 IST)

న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్‌ ఆపేసిన బార్క్ బోర్డ్.. ఎందుకో తెలుసా?

న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది బార్క్ బోర్డ్. రేటింగ్ కోసం న్యూ ఛానల్స్ పాకులాడుతున్నాయని ఆరోపణలు రావడంతో బార్క్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా దీనిపై టెక్నికల్ కమిటీని నియమిస్తోంది. ఈ కమిటీ ప్రస్తుతం డేటాను కొలిచి, నివేదించడంలో ఉన్న ప్రమాణాలను పరిశీలించడంతో పాటు, ఇళ్లలోకి చొరబడి రేటింగ్స్‌ను తారుమారు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి సూచనలు చేస్తుంది.
 
ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ ఛానెళ్లతో పాటు బిజినెస్ ఛానెళ్లలో వెంటనే టెక్నికల్ కమిటీ చర్యలు మొదలవుతాయి. మొదట న్యూస్ జానర్‌లో ఉన్న ఛానెళ్లను ఈ కమిటీ పరిశీలించనుంది. ప్రస్తుతం కమిటీ పరిశీలన ఉండటంతో అన్ని న్యూస్ ఛానెళ్ల వీక్లీ ఇండివిజ్యువల్ రేటింగ్స్‌ను బార్క్ నిలిపివేస్తోంది. బార్క్ టెక్నికల్ కమిటీ పరిశీలన, పర్యవేక్షణ, ఇతర ప్రక్రియంతా పూర్తవడానికి కనీసం 8 నుంచి 12 వారాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ రావు.
 
ఇటీవలి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విరామం అవసరం అని బార్క్ బోర్డ్ భావించింది. ఇప్పటికే అమలు చేస్తున్న కఠినమైన ప్రోటోకాల్స్‌ని మరోసారి సమీక్షించడం బార్క్ ఇండియా దగ్గరగా పనిచేస్తుందని బార్క్ ఇండియా బోర్డ్ ఛైర్మన్ పునీత్ గోయెంకా తెలిపారు.