1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:12 IST)

బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబు దాడి.. ఎక్కడ?

బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబ్ దాడి జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో మాత్రం ఓ రౌడి అనుచరులు బిర్యానీ పెట్టలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబ్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్‌ పేరుతో హోటల్‌ నిర్వహిస్తున్నారు. 
 
వారి హోటల్‌కు ఎబిన్ అనే రౌడీషీటర్ అనుచరులు బిర్యానీ కోసం వచ్చారు. రౌడీషీటర్‌ ఎబిన్‌ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ పెట్టాలని బెదిరించగా.. వారు అందుకు నిరాకరించారు. దీంతో హోటల్ దగ్గరే ఆగ్రహం వ్యక్తం చేసి ఎబిన్‌ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు.
 
కొంచెం సేపటి తర్వాత నాలుగు బైక్‌లపై 8మంది వచ్చి హోటల్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. దీనిపై హోటల్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.