శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (15:46 IST)

యువకుడు వికృత చేష్టలు... దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య కన్నుమూత

ఓ యువకుడు వికృత చేష్టలకు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గం తాలూకా కొండాపురం గ్రామంలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యను అదే గ్రామానికి చెందిన వినయ్‌ అనే యువకుడు కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెతో జరిపిన సంభాషణలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీన్ని గుర్తించిన ఆమె భర్త వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో వినయ్‌ కుటుంబ సభ్యులు బాధిత దంపతులపై కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయసాగారు. కేసు ఉపసంహరించుకోకుంటే చంపుతామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో ఫోన్‌లో వినయ్‌ కుటుంబం బెదిరింపులను రికార్డు చేశారు. 
 
వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టి అనంతరం తోణచేనహళ్లి శివారులోని వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. వాట్సాప్‌ మెసేజ్‌ గుర్తించిన శ్రీరాంపురం పోలీసులు వీరు ఉరేసుకున్న ఘటనా స్థలికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. 
 
అయితే అప్పటికే భర్త మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వినయ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.