1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (09:33 IST)

"హర్ ఘర్ తిరంగా" ప్రచార వెబ్‌సైట్... 5 కోట్ల సెల్ఫీలు అప్‌‍లోడ్

har ghar tiranga
భారత 75వ వజ్రోత్సవ వేడుకలు సోమవారం దేశ వ్యాప్తంగా వాడవాడలా జరిగాయి. ప్రతి ఒక్క పౌరుడుతో పాటు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అదేసమయంలో ఈ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రారంభించిన ప్రచారం వెబ్‌సైట్ త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. ఏకంగా ఐదు కోట్ల సెల్పీలు ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. 
 
సోమవారం అధికారిక వెబ్‌సైట్‌లో జాతీయ జెండాతో తమ సెల్ఫీలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో తమవంతు భాగస్వాములయ్యారు. 
 
ఇది అద్భుతమైన విజయంగా పేర్కొంటూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకుంది. ఈ విజయం భారతదేశ ఐక్యత మరియు ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. 
 
స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమతమ గృహాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇది 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలా సాగాలని కోరారు. ఈ పిలుపునకు స్పందించిన దేశ ప్రజలు ఈ వెబ్‌సైట్‌లో తమ ఇళ్లముందు ఎగురవేసిన జాతీయ జెండాలతో దిగిన సెల్ఫీలను తీసి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. 
 
ప్రచారాన్ని ఒక అడుగు ముందుకు వేస్తూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నోడల్ ఏజెన్సీ, ప్రజలు తమ జెండాతో సెల్ఫీలు తీసుకుని ప్రచార వెబ్‌సైట్ www.harghartirang.comలో అప్‌లోడ్ చేసే వెసులుబాటును కల్పించాయి.