1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

రేప్ జరిగిందనీ ప్రిన్సిపాల్‌కు చెబితే.. ఇలాంటివి కామనేనన్నారు...

తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తన స్నేహితురాల సహకారంతో క్లాస్ టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెబితే ఇలాంటివి జరుగుతుంటాయనీ పెద్దగా పట్టించుకోవద్దని అన్నాడు... దీంతో సూసైడ్ చేసుకోవాలని భావించా. కానీ, తన

తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తన స్నేహితురాల సహకారంతో క్లాస్ టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెబితే ఇలాంటివి జరుగుతుంటాయనీ పెద్దగా పట్టించుకోవద్దని అన్నాడు... దీంతో సూసైడ్ చేసుకోవాలని భావించా. కానీ, తన స్నేహితురాళ్లు వారించడంతో అఘాయిత్యానికి పాల్పడలేదని ఆ బాలిక రాసిన లేఖ ఇపుడు వాట్సాప్‌లో కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హర్యానాలోని గోహానా నగరంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ఈ లేఖ రాసింది. కానీ, ఆమె ఎవరో తెలియదు. పాఠశాల కార్యాలయ గదిలో తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని ఆ అజ్ఞాత బాలిక రాసింది. అఘాయిత్యానికి ఒడిగట్టారంటూ ఇద్దరు సిబ్బంది పేర్లనూ పేర్కొంది. వాట్స్‌ప్‌లో సర్క్యులేట్‌ అవుతున్న ఈ లేఖ కలకలం రేపుతోంది! 
 
ఈ లేఖలో "నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. నా ఫ్రెండ్‌ వారించింది. మేం క్లాస్‌ టీచర్‌ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెప్పాం. ఇలాంటివి జరుగుతుంటాయి అని ప్రిన్సిపాల్‌ అన్నారు. స్కూల్‌ డైరెక్టర్‌కు చెబుదామనుకున్నా ఉపయోగం లేదని అనిపించింది. దాంతో మీకు రాస్తున్నా మోడీ అంకుల్‌. నా జీవితాన్ని నాశనం చేశారు" అంటూ ఉన్న ఆ లేఖ అందర్ని కదిలించింది. పాఠశాలలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
 
కాగా, ఈ లేఖ రాసిన బాలిక ఎవరో తెలియకపోయినప్పటికీ.. కేసు తీవ్రత దృష్ట్యా, ఆ లేఖ ఆధారంగా హానా నగరంలో ఓ ప్రైవేటు పాఠశాల భవనం ఇన్‌స్పెక్టర్‌ సుఖ్బీర్‌, అకౌంటెంట్‌ కరణ్‌వీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.