శుక్రవారం, 27 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (13:05 IST)

తమిళనాడు అసెంబ్లీలో టెన్షన్.. టెన్షన్.. స్పీకర్ కుర్చీని విరగ్గొట్టిన డీఎంకే ఎమ్మెల్యేలు

తమిళనాడులో ఉద్రిక్తత క్షణ క్షణానికి పెరుగుతోంది. బల పరీక్షను అడ్డుకోవాలని ఒకరు, జరిపించాలని మరొకరు చూస్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో అసలు అన్నాడీఎంకే పార్టీ ఎవరిది? అసలు దాని నేతలు ఎవరన

తమిళనాడులో ఉద్రిక్తత క్షణ క్షణానికి పెరుగుతోంది. బల పరీక్షను అడ్డుకోవాలని ఒకరు, జరిపించాలని మరొకరు చూస్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో అసలు అన్నాడీఎంకే పార్టీ ఎవరిది? అసలు దాని నేతలు ఎవరనే దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఎవరు విప్? పన్నీర్ వైపు నుంచి ఒక విప్ ఉన్నారు. శశికళ వైపు నుంచి ఒక విప్ ఉన్నారు. ఇద్దరూ రెండు రకాలైన విప్‌లను జారీ చేశారు. దీంతో ఎవరి భవితవ్యం ఏమవుతుందనే దానిపై ఇప్పుడు ఎమ్మెల్యేల్లో గందరగోళానికి దారి తీసింది. ప్రజాస్వామ్యయుతంగా ఓటింగ్ జరగడంలేదని పన్నీర్, స్టాలిన్ వర్గం ఆందోళన నిర్వహిస్తోంది. 
 
మరోవైపు.. తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, రహస్య ఓటింగ్ పెట్టాలంటూ స్టాలిన్, పన్నీర్ వర్గీయులు పట్టుపట్టారు. అయితేవారి వినతిని స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే ఎమ్మెల్యేలు సభలో నానా హంగామా చేశారు. స్పీకర్ పోడియాన్ని ముట్టడించి చైర్‌‌ను విరగొట్టారు. అనంతరం డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే సెల్వం ఆ చైర్‌‌లో కూర్చున్నారు. బెంచీలపై నిల్చుని డీఎంకే ఎమ్మెల్యేలు మైకులు, కుర్చీలు, పేపర్లు విసిరారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. స్పీకర్‌‌‌ను మార్షల్స్ క్షేమంగా బయటికి తరలించారు.
 
అయితే, రహస్య ఓటింగ్ పెట్టాలని డీఎంకే, పన్నీర్ వర్గ ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడంతో డీఎంకే ఎమ్మెల్యేలంతా అసహనంతో స్పీకర్ కుర్చీ ముందు ఉండే టేబుల్‌ను విరగ్గొట్టారు. మైక్రోఫోన్లను తెగ్గొట్టి, పేపర్లను చించేశారు. అక్కడున్న అన్ని కుర్చీలను కూడా విరగ్గొట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు