మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (08:31 IST)

ఒడిషాలో దారుణం: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తల నరికేశాడు...

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మయూర్‌భంజ్ జిల్లా గిరీష్ చంద్రాపూర్ గ్రామానికి చెందిన జీతూ లోహార్ (43) అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. భార్య చాలా కాలంగా  గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో భర్త భార్యతో రాత్రి గొడవపడ్డాడు. 
 
ఆవేశంలో పదునైన కత్తితో భార్య తలను నరికి చంపాడు. ఆపై భార్య తలను ఇంట్లో పెట్టి మొండాన్ని బయటపడేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య తలను ఇంటినుంచి రికవరీ చేసి భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.