1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (11:00 IST)

మోడీకి నితీశ్ షాక్... పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కడగండ్ల పాలయ్యారు

ప్రధాని నరేంద్ర మోడీకి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో, నితీశ్ కుమార్ దానిని సమర్థించ

ప్రధాని నరేంద్ర మోడీకి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో, నితీశ్ కుమార్ దానిని సమర్థించి సంచలనం సృష్టించారు. ఇపుడు వెనక్కి తగ్గారు.  పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కడగండ్ల పాలయ్యారంటూ మండిపడ్డారు.
 
శనివారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో తొలిసారిగా ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 'పెద్ద నోట్ల రద్దుకు సైద్ధాంతికంగా మద్దతు ఇచ్చినా.. అది అమలు జరిగిన తీరు పేలవంగా ఉందని చెప్పడానికి వెనకాడడం లేదు. సామాన్యులు కడగండ్ల పాలయ్యారు. చాలామంది కేవలం లోటుపాట్లనే చూస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.
 
నిజానికి బీహార్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పైగా, పెద్ద నోట్ల రద్దుకు గట్టి మద్దతుదారు, ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న నితీశ్ కుమార్‌ ఇపుడు యూ తీసుకోవడం గమనార్హం. అదీ కూడా బీహార్‌ బీజేపీ సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా కేంద్రంలో మోడీ నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న శనివారమే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.