శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 నవంబరు 2015 (14:33 IST)

అవినీతిని రూపుమాపడం మా ప్రథమ లక్ష్యం: ప్రధాని మోడీ

అవినీతిని రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... తక్కువ వ్యవధిలో నల్లధనం నిరోధానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 
 
అవినీతిని నిరోధించడానికి ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవినీతికి పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాల్సిన అవసరముందన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, పేదరిక నిర్మూలనకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.