శశికళ వర్సెస్ శశికళ .. హైకోర్టు నోటీసు : చిన్నమ్మకు పెరుగుతున్న ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె స్నేహితురాలు శశికళ పేరును ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ ఎంపీ శ
అన్నాడీఎంకే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె స్నేహితురాలు శశికళ పేరును ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ ఎంపీ శశికళ పుష్పా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... శశికళతో పాటు.. అన్నాడీఎంకేకు నోటీసు జారీ చేసింది.
ఇదిలావుండగా, జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో ప్రారంభమైన ‘రాజకీయాలు’ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆధిపత్య పోరు కోసం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె వ్యతిరేక వర్గం మధ్య మొదలైన అంతర్గత పోరులో చివరికి ‘చిన్నమ్మే’ పైచేయి సాధిస్తోంది. పార్టీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవడంలో శశికళ విజయం సాధించారు.
ఆమెకు జై కొడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 130 మంది ఎమ్మెల్యేలు జయ నివాసమైన పోయెస్ గార్డెన్కు వెళ్లి శశికళను కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలంటూ ఆమెను అభ్యర్థించారు. మరోపక్క శశికళ వారసత్వానికి సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సి.పొన్నయ్యన్ ప్రకటించడం గమనార్హం.