బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (10:54 IST)

ఇంటి పనిమనిషిపై జర్నలిస్టు అత్యాచారం... ఎక్కడ?

ఇంట్లో పని చేసే పని మనిషిపై సీనియర్ జర్నలిస్టు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వయసు 53 యేళ్లు కాగా, ఆ పని మనిషి వయసు 25 యేళ్లు. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఒడిషాకు చెందిన 25 యేళ్ల యువతి గురుగ్రామ్‌లో ఉన్న ఓ ఇంటిలో పాచిపని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ ఇంట్లోనే 53 యేళ్ళ వ్యక్తి ఒకరు సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. అయితే, ఈ నెల 4వ తేదీన అర్థరాత్రి దాటిన తర్వాత పని మనిషి నిద్రపోతున్న గదిలోకి వెళ్ళిన జర్నలిస్టు ఆమెను అసభ్యంగా తాకి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, అతని నుంచి తప్పించుకున్న ఆ యువతి బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని తన మాన ప్రాణాలను కాపాడుతుంది. మరుసటి రోజు ఉదయం అక్కడ నుంచి బయటపడిన ఆమె.. తన స్నేహితురాలికి విషయం చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసీపీ కరణ్ గోయల్‌ తెలిపారు.