గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (12:02 IST)

సెల్ఫీ కోసం వచ్చి 15 మంది యువకుల వికృత చేష్టలు.. బాధితురాలు ఎవరో తెలుసా?

కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు. భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబ

కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు. భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబుతూ, బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. పూటుగా తాగి ఆమెను వేధించారు. ఎంత హెచ్చరించినా వినలేదు. ఆ బాధితురాలు ఎవరో కాదు.. రెవెన్యూ శాఖ డిప్యూటీ డైరక్టర్ భార్యే.
 
ఈ వ్యవహారాన్ని భర్త వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని ఆమె చెప్పినా, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయన ఫిర్యాదు చేయలేదు. ఆపై కమ్మనహళ్లి కేసులో నిందితుల అరెస్టు తరువాత, మనసు మార్చుకుని ఈ నెల 4న ఆయన ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు శివరాజ్ అనే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది కోసం గాలిస్తున్నామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చంద్రగుప్త వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా 15 మందిపై కేసులు పెట్టినట్లు చెప్పారు.