1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:13 IST)

కాంగ్రెస్​ పార్టీకి షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌లోకి గోవా మాజీ సీఎం

Goa ex CM
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్​ పార్టీకి ఆ రాష్ట్రంలో పెద్ద షాక్ తప్పలేదు. సోమవారం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోవా మాజీ సీఎం లుయీజిన్హో ఫలేరో(70) ఇవాళ(సెప్టెంబర్-29,2021) తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
బెంగాల్ రాజధాని కోల్ కతాలో మమతా బెనర్జీ మేనల్లుడు,టీఎంసీ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి పార్టీ కండువా కప్పి.. ఫలేరోను టీఎంసీలోకి ఆహ్వానించారు. అంతకుముందు గోవా నుంచి బెంగాల్‌కు వచ్చిన ఫలేరో ముందుగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జితో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
 
టీఎంసీలో చేరిన సందర్భంగా లుయీజిన్హో ఫలేరో మాట్లాడుతూ.. గోవాకు మమతా బెనర్జీ నాయకత్వం అవసరం ఉందని, అందుకే తాను టీఎంసీలో చేరినట్లు తెలిపారు. గోవాకి నమ్మకమైన ప్రత్యామ్నాయం కావాలి.. ఆ నమ్మకమైన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీలో కనిపించందన్నారు. గోవా సంస్కృతి, అక్కడి భిన్నత్వం.. ఇప్పుడు చాలా ప్రమాదంలో పడిందని.. తాను మమతా బెనర్జీనికి గోవాకు రావాలని విజ్ణప్తి చేస్తున్నానని అన్నారు.