ఉపాధ్యాయులే కామాంధులైన వేళ.. మైనర్ బాలికలపై అత్యాచారం.. గర్భం దాల్చిన విద్యార్థినులు..
పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కామాంధులుగా మారారు. మహారాష్ట్రలోని బుల్దానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయులే కొంతకాలంగ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఉపాధ్యాయులను పోలీసు
పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కామాంధులుగా మారారు. మహారాష్ట్రలోని బుల్దానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయులే కొంతకాలంగ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన సమాజంలో ఆడపిల్లలకు భద్రత కరువైంది.పాఠాలు చెప్పాల్సిన పంతుల్లే ఇలా ప్రవర్తిస్తుంటే సభ్యసమాజం తలదించుకుంటుంది.
12 మంది మైనర్ గర్ల్స్పై ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడటంతో ముగ్గురు దాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముంబై నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లా, హివర్ఖేడాలోని నినాధి ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం చోటుచేుసుకుంది. దీపావళి ముందుగా ఈ ఘటన చోటుచేసుకుందని.. ఇందుకోసం స్పెషల్ వుమెన్ పోలీసు అధికారులను విచారణ నిమిత్తం పంపినట్లు బుల్దానా ఎసై ఎస్డీ బవిస్కర్ తెలిపారు. పది మంది నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.