1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (10:09 IST)

సోదరి మృతిని జీర్ణించుకోలేని సోదరుడు.. చితిలో దూకేశాడు..

fire
తనకు వరుసకు సోదరి కజిన్ సిస్టర్ మృతి చెందడాన్ని ఓ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమె చితి మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు అతన్ని ఇతరులు రక్షించగా, కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మణక్యా గ్రామానికి చెందిన 25 యేళ్ల యువకుడు సుఖ్‌దేవ్ భిల్‌ కజిన్ సిస్టర్ చనిపోయింది. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే, ఆమె మృతిని జీర్ణించుకోలేని భిల్.. ఆమె చితి మంటల్లో దూకేశాడు. అతను మంటల్లో దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు గుర్తించి రక్షించి, ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అయితే, ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. 
 
ఈ ఘటనపై భివారా అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందిస్తూ, భిల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని, ప్రస్తుతం అతను 95 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పాడు.