విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి.. 2 రోజుల పాటు వర్షాలు!
వేసవిలో చల్ల చల్లగా వర్షం పడితే ఎలా ఉంటుంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణికి అనుంబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా కనిపిస్తోంది.
హైదరాబాద్లో మంగళవారం ఐదింటి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఈ అల్ప పీడన ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే నెల ఐదో తేదీన కురిసిన భారీ వర్షాలకు చెట్లు విరిగిపడిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో 75ఎమ్ఎమ్ వర్షపాతం నమోదైంది.