1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (16:11 IST)

ఒక్కసారి కూడా కోర్కె తీర్చలేదు.. ఆయన నపుంసకుడు.. విడాకులు కావాలి...

తన భర్త నపుంసకుడని, అతనితో కాపురం చేయలేనని, అందువల్ల తనకు విడాకులు ఇప్పించాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కర్నాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన ఈ మహిళ భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేయడమే

తన భర్త నపుంసకుడని, అతనితో కాపురం చేయలేనని, అందువల్ల తనకు విడాకులు ఇప్పించాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కర్నాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన ఈ మహిళ భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
‘మా వివాహం జరిగి రెండేళ్ళు కావస్తోంది. షిమోగా జిల్లాలో మా పెళ్ళి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నాతో సంసారం చేయనేలేదు. తీరా ఆయన సంసారానికి పనికిరాడని నపుంసకుడని తేలింది. ఈ మహానుభావుడితో ఇక కాపురం చేయలేను. విడాకులు ఇప్పించండి మహా ప్రభో..’ అంటూ బెంగుళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 
 
ఇలా కేసు దాఖలు చేసిందో లేదో భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఆమె ఆర్‌.టి. నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్రమైన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరిని స్టేషనకు పిలిపించి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. యువతి నుంచి ఫిర్యాదు స్వీకరించినప్పటికీ ఆమె పేరును, ఇతర వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.