1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 జులై 2023 (14:43 IST)

ఐటీ కేపిటల్‌లో రోబో సాయంతో భారీ పేలుళ్ళకు కుట్ర

terrorist
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు మహానగరంలో ఉగ్రసంస్థ ఐసిస్‌ సహకారంతో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారని ఎన్.ఐ.ఏ ఆరోపిస్తుంది. దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) విచ్ఛిన్నం చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా వీరిపై చార్జిషీటును తాజాగా సమర్పించింది. 
 
ఆ కుట్ర కేసులో మహ్మద్‌ షరీఖ్‌ (25), మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (23), సయ్యద్‌ యాసిన్‌ (22), రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌ (22), హుజైర్‌ ఫర్హాన్‌ బేగ్‌ (22), మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (22), కేఏ నదీం అహ్మద్‌ (22) జబీవుల్లా (32), ఎన్‌.నదీమ్‌ ఫాజిల్‌ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. 
 
రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌, మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌, కేఏ నదీం అహ్మద్‌ అనే వారు మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా మరో ఇద్దరికి సాంకేతిక విద్యానేపథ్యం ఉందని గుర్తించారు. దాన్ని ఉపయోగించుకుని రోబోట్లు, డ్రోన్‌ల సాయంతో దాడులకు ప్రణాళికలను రూపొందించారని ఎన్‌ఐఏ తన అదీనపు అభియోగపత్రంలో పేర్కొంది. భద్రా నదీ తీరంలో తాము తయారు చేసిన బాంబును పేల్చారని ఇప్పటికే ఒక అభియోగపత్రంలో ఎన్‌ఐఏ పేర్కొంది.